Showing posts with label Health benefits. Show all posts
Showing posts with label Health benefits. Show all posts

Friday, December 29, 2017

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే?

Image result for kidneys
కొందరికి మూత్రానికి వెళ్తే మంట, మరికొందరికి మూత్రపిండాలలో ఇబ్బంది ఈ సమస్యలకు కారణం మీకు మూత్ర పిండాల సమస్య మొదలైదని అర్ధం. మనం చేసే అశ్రధ్ధ వల్లే ఈ సమస్య తెలెత్తుతుంది. మనం ఆచరించే అలవాట్లూ ఆహారమే వీటిపై ప్రభవం చూపిస్తాయి. మన మూత్రపిందాలు బాగుండాలతే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు. అవేంటో చూద్దమా..
1. మీ శరీరాన్ని శుభ్ర పరచేది నీరు మాత్రమే. కనుక, తగినన్ని ద్రవాలు తీసుకోవటం మీ కిడ్నీ లను శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది.2. బ్లాక్ బీన్స్ మీ కిడ్నీల ఆరోగ్యానికి బ్లాక్ బీన్స్ తినటం మంచిది. వీటిలో ఫాస్ఫరస్ అతి తక్కువ అందువలన అవి కిడ్నీ లకు మంచిది.
3. తరచుగా మూత్రం పోయండి రోజులో ఎక్కువ సార్లు మూత్రం పోయటం కిడ్నీ ల ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతి సారి మీ మూత్రపు సంచి నిండి నిండి ఉందాలి.
4. నల్ల రంగు బెర్రీ లు దట్టమైన రంగులు కల ఆహారాలు సాధారణంగా మీ కిడ్నీలకు మంచిది. బ్లూ బెర్రీ లు, బ్లాక్ బెర్రీ లు, క్రాన్ బెర్రీ లు సిట్రస్ జాతికి చెంది అధిక అంటి ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి. అవి కిడ్నీ సమస్యలను తొలగిస్తాయి.
5. కొత్తిమీర వాస్తవంలో మీ కిడ్నీలను శుభ్ర పరచేందుకు సహకరిస్తున్ది. కోరియందర్, పార్సిలీ , సిలాన్త్రో లు ఒకే జాతికి చెందినవి. ఇవి కిడ్నీల ఫిల్టర్ లను శుభ్ర పరుస్తాయి.
6. టేబుల్ సాల్ట్ లో కంటే సి సాల్ట్ లో సోడియం క్లోరైడ్ తక్కువ. కనుక మీరు కనుక కిడ్నీ రాళ్ళతో బాధ పడుతూంటే, సీ సాల్ట్ ఉపయోగించటం చాలా మంచిది.7. కారం కల మిర్చి తినటం కిడ్నీలకు మంచిది కాదు. అధిక మసాలా ఆహారాలు మీ లివర్, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతాయి. కనుక మీ ఆహారంలో తగుమాత్రం కారాలు ఉండేలా చూసుకోండి.
8. సిగరెట్ లలో కాడ్ మియం అనే మెటల్ వుంటుంది. అది మీ కిడ్నీల లైనింగ్ లో డిపాజిట్ అవుతుంది . కిడ్నీల పనిని ఇది మందగిస్తుంది. రీనల్ ఫెయిల్యూర్ కు కూడా దోవ తీస్తుంది.
9. అరుగుల అనేది ఒక పచ్చని ఆకు కూర అది మీ కిడ్నీల లోని టాక్సిన్ లను బయటకు పంపుతుంది. అరుగుల కనుక రెగ్యులర్ గా తింటే కిడ్నీ సమస్యలతో బాధలు పడే వారికి మంచి రిలీఫ్ కలుగుతుంది.
10. మూత్రము ను ఆపు కొనవద్దు కొంతమందికి మూత్రంను ఎక్కువ సమయం ఆపుకొనే అలవాటు వుంటుంది ఇది చెడు అలవాతు. అది మీ కిడ్నీ లపై ఒత్తిడి కలిగిస్తుంది.11. మస్టర్డ్ గ్రీన్స్ ఆకు కూరలో విటమిన్ కె అధికం. ఇది కిడ్నీ లకు బ్లడ్ సరఫరా అధికం చేస్తుంది.
12. కిడ్నీ లను ఎలా సంరక్షించు కోవాలి అని మీరు ఒత్తిడికి గురవుతూంటే, ముందుగా మీరు కొంత రిలాక్స్ అవటం ఎంతో మంచిది. కిడ్నీలు డామేజ్ అయ్యేటందుకు ఒత్తిడి ఒక ప్రధాన కారణం. కనుక రిలాక్స్ అయి ఒత్తిడికి దూరంగా వుండి కిడ్నీలు బాగా పని చేసేలా చూసుకోండి.
13. రెడ్ కేబెజ్ మీకు కనుక డయాబెటిస్ ఉన్నట్లయితే మీ కిడ్నీలు వేగంగా చెడిపోయే అవకాశం వుంది. కేబెజ్ వంటి ఆకు కూరలు కిడ్నీల డామేజ్ ని అరికడతాయి
14. మీ కిడ్నీ లు సరిగ్గా మీ హిప్ ల పైన వీపు దిగువ భాగంలో వుంటాయి. కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ వ్యామాలు చేస్తే, కిడ్నీలు సవ్యంగా పని చేసే అవకాశం వుంటుంది .
15. అలసిన మీ శరీర కణాల పునరుజ్జీవానికి చక్కటి శరీర విశ్రాంతి అవసరం. కనుక బాగా నిద్రించండి. మీ ఇతర శరీర అవయవాల వలెనె, కిడ్నీ లు కూడా అధిక పని చేస్తే అలసి పోతాయి. కనుక ప్రతి రోజూ 8 గంటల పాటు తప్పక విశ్రాంతి తీసుకోండి.
16. యోగ లోని కొన్ని భంగిమలు కిడ్నీ లు సవ్యంగా పని చేసేలా చెస్తాయి. మీ కిడ్నీల మంచి పని తీరుకు క్రేన్, క్రేసేంట్ లున్గే భంగిమలు రెండూ బాగా పని చేస్తాయి.

Thursday, December 28, 2017

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

జలుబు దగ్గు నుంచీ విముక్తి పొందండిలా! – దగ్గు తగ్గడానికి చిట్కాలు

Image result for cold
వాతావరణం మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పు మొదలై ఎంతో సతమతమయ్యేలా చేస్తాయి. వీటి రాకతో మన శరీరం అంతా కంపించిపోయి అటు మింగలేక బయటకు కక్కలేక అన్న చందంలో పరిస్థితి మారుతుంది. అందుకే వీటిని అంటు వ్యాధులంటారు. వీటి నివారణకు మనం తీసుకునే ఆహారంలో స్వల్పంగా మార్పులు చేసి తీసుకుంటే వీటి బారిన పడకుండా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనం పొందవచ్చు.
అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మీరు కాపాడుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక ప్రాథమిక జాగ్రత్త.1.జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.
2.వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు.
3. పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.
4. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
5. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.6. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.
7. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.
8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి.
9. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి.
10.సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.
11.పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.
12.మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
13.మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను ఆరగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Wednesday, December 27, 2017

పరధ్యానం నుంచి బయటపడాలంటే

పరధ్యానం నుంచి బయటపడాలంటే

Image result for depression

పరధ్యానం అంటే?

మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అని మన పెద్దవాళ్ళూ, ఉపాధ్యాయులూ మనల్ని తిట్టటం తెలిసిందే. అయితే ఆ సామెతకు అర్థం మనిషిక్కడ, మనసక్కడ అని అర్థం. అయితే ధ్యానంలొ ఉంటే ఫర్వాలేదుగాని పరధ్యానంలో ఉంటేనే సమస్య. పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. ఈ సమస్యను చాలా మందిలో మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు మనమే ఒక్కోసారి అలా ప్రధ్యానంలో ఉండిపోతుంటం. ఆదేంటి నేను బాగా తెలివైనవాడినేనే నాకు అంతా బాగానే ఉంటుందే అని అనుకుంటున్నారా. తెలివితేటలు ఎక్కువైన వారికే ఎక్కువ ఈ సమస్య వస్తూ ఉంటుంది.
పరధ్యానానికి ఎన్నో కారణాలుంటాయి. వాటితో ఎన్నో సమస్యలూ వస్తాయి. వాటిని అధిగమించడాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఆఅ జగ్రత్తలేమిటో చుద్దామా..!పరధ్యానం అంటే ఏమిటి? మనిషి ఉన్న చోటే ఉండి, అతని ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉండటం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కానట్టుగా ఉంటారు. దీని వల్ల ఎన్నో పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆలోచన, ఆచరణ ఒకేదానిపై కేంద్రీకరించినప్పుడు ఆ పని సఫలీకృతం అవుతుంది. అంతమాత్రాన పరధ్యానం మానసిక వ్యాధి అని చెప్పడానికి లేదు. కొంత మంది వ్యక్తితత్వం అలా ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే వ్యాధి రూపంలో ఒక లక్షణంగా ఉంటే ఉండొచ్చు. మామూలు వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. పరధ్యానానికి వారు వీరు, వయసు తేడా ఏమీ లేదు.
పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు…సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో విహరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు.ఎప్పుడూ మానసిక ప్రశాంతను కోరుకుంటారు. తమ భావాలను మరొకరితో పంచుకోవడానికి అంత ఉత్సాహం చూపరు. తక్కువగా మాట్లాడుతారు. ప్రతి ఒక్క విషయానికి ఇంకొకరిమీద ఆధారపడుతుంటారు. మెచ్యూర్డ్‌గా ఉండరు. సహజత్వానికి దూరంగా ఉంటారు.

పరధ్యానంగా వల్ల తలెత్తే సమస్యలు

1.నేర్చుకోవాలన్న ఆసక్తి, ఏకాగ్రత ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో ఆ పని మైండ్‌లో రిజిస్టర్ కాదు.
2.ఇది పిల్లల్లో అయితే చదువులో వెనకబడేలా చేస్తుంది.3. పెద్దల్లో పనుల్లో లోపాలు, జాప్యం, కెరియర్‌లో ఎదుగుదల లేకపోవడం వంటి నష్టాలు సంభవిస్తుంటాయి.
4.సమస్యల నుంచి తప్పుకోవాలనుకుంటారు. ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు.
5.కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దూరంగా ఉంటారు కనుక ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతుంటారు.
6.వివాహ బంధంలో భాగస్వామితో త్వరగా సర్దుకుపోలేరు. ఎదుటి వ్యక్తి అంటే ఉండే భయం కారణంగా వివాహం కూడా వద్దనుకుంటారు.7.ఏదైనా వర్క్ విషయంలో ‘చేస్తాను’ అని మాట ఇచ్చి నిలుపుకోలేరు. దీంతో ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతుంటారు.

ఈ సమస్యకు కారణాలు

1. వంశపారంపర్యం: తల్లిదండ్రుల్లో పరధ్యానం సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది.
2. కుటుంబ వాతావరణ: ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలతో చులకనగా మాట్లాడటం. ‘నీకే పనీ చేతకాదు, ఓ చోట కూర్చో, నువ్వు సరిగ్గా చదవలేవు…’ వంటి పెద్దల మాటల ప్రభావం చిన్నతనంలో ఒంటరిగా ఉండేలా చేస్తుంది.
ఇంకొంతమంది పిల్లల్ని అతిగారాబం చేస్తుంటారు. తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా… ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భావంలో ఉంటారు. అన్నీ సజావుగా జరిగిపోవడంతో ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటారు. తమకు అనుగుణంగా లేనప్పుడు త్వరగా మూడీ అయిపోతారు. ఇవి రకరకాల ఆలోచనలను కలిగిస్తాయి.
3. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు (ఎమోషనల్ ప్రాబ్లమ్స్), అతిగా ఆలోచిస్తున్నప్పుడు కూడా పరధ్యానం వస్తుంటుంది.
4. పెద్దవారిలో పర్సనాలిటీ డిసార్డర్స్, మేజర్ డిప్రెషన్ డిసార్డర్స్ వల్ల మనసు దిగులుగా, దుఃఖంగా ఉండటం, తమను తాము తక్కువగా అంచనా వేసుకొని వాళ్లలో వాళ్లు లీనమైపోతారు.స్కిజోఫ్రీనియో: ఇది తీవ్రతరమైన మానసిక జబ్బు. వ్యక్తి తన ఆలోచనల్లో తాను ఉండిపోతాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా బాధాకరంగా అనిపిస్తుంటుంది. అందరూ బాధపెట్టేవారుగానే కనిపిస్తారు. రకరకాల అనుమానాలు పెట్టుకుంటారు. తమ ముందు ఎవరూ లేకున్నా, ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటారు.
మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు అలవాటైన వారు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఉంటారు. మందుల ప్రభావం వల్ల, వ్యసనం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది.
మల్టీటాస్కింగ్ : ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది.
వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు.. ఎన్నో రకాల పనులు పెట్టుకునేవారిలో ఈ సమస్య ఉంటుంది. దీని వల్ల తప్పులు దొర్లుతుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది.స్ర్తీలు- ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు. ఇలా ఒక పని తర్వాత మరో పని పెట్టుకొనే వారు, పనులను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోనివారు పరధ్యానంగా కనిపిస్తుంటారు. దీంతో ‘మర్చిపోతున్నాం’ ‘మతిమరుపు మూలంగా ఏ పనీ చేయలేకపోతున్నాం’ అని తిట్టుకుంటూ ఉంటారు. కాని ఇది మతిమరుపు కాదు, పరధ్యానం వల్ల కలిగే సమస్య.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే

1. ఇష్టమైన పనులు చేయాలి. వారం మొత్తం ఏమేం పనులు చేశామో వారాంతంలో గుర్తుచేసుకొని బుక్‌లో రాసుకోవాలి.
2. ఏకాగ్రత కుదరడానికి, సోషల్ స్కిల్స్‌లో ప్రావీణ్యానికి శిక్షణ తీసుకోవాలి.
3. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
4. సమయానుకూలంగా పనిని విభజించుకొని దానికి తగినట్టుగా పనులు చేసుకోవాలి.
5. అదేవిధంగా ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకోవాలి. అనుకున్న పని పూర్తవగానే టిక్ పెట్టుకోవాలి.
6. ఏకాగ్రత పెరగడానికి రకరకాల పజిల్స్‌తో మెంటల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
7. పిల్లలు దేని కారణంగా పరధ్యానంగా ఉంటున్నారో తెలుసుకొని, చర్చిస్తే ఆ సమస్యకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది.
మనస్తత్వ నిపుణులను సంప్రదించి, మానసిక రుగ్మతతో ఉంటే చికిత్స తీసుకోవాలి.

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Image result for green tea

ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

  •  క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ,  పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్  ప్రమాదము నుండి కాపాడుతుంది.

  •  గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.

  • రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

  • కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.

  •  మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి  వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.

  •  కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

  •  ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది,

ఇంకెందుకు ఆలస్యం  రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

డెంగ్యూ గురించి తెలుసుకుందాం

డెంగ్యూ గురించి తెలుసుకుందాం రండి..!


Image result for dengue
అమ్మో..డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న అంటువ్యాధి డెంగ్యూ.ఇప్పుడు భారతదేశంలో ప్రజలను గడ గడలాడిస్తున్న అంటురోగాలో ముఖ్యమైనది.ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో,ఉప ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో ఇది బాగా ప్రబలుతుంది.దీనినే ఆంగ్లంలో ‘బ్రేక్ బోన్
ఫీవర్ ‘ అనికూడా అంటారు.ఈ వ్యాధి దెంగ్యూ వైరస్ వల్ల ఇది సోకుతోంది.దీనివల్ల జ్వరం, తలనొప్పి, నరల నొప్పులు,కొండరాల నొప్పులు, తట్టు మచ్చలు వస్తాయి.కొంత మందిలో చలా తక్కువ శాతం మంది దెంగ్యూ వ్యాధి సోకి రక్తస్రావం, రక్తపట్టికల శాతం పూర్థిగా తగ్గిపోవటం వంటివి జరుగుతాయి.అలాగె
కొన్నిసార్లు రక్తంలోని ప్లాజ్మా కారే అవకాశాలున్నాయి.ఈ వ్యాధి డెంగ్యూ షాక్ సిండ్రోం లొనికి కూడా మెల్ల మెల్లగా చేరుస్తుంది.ఇది చాలా ప్రణాంతకమైన వ్యాధి.ఈ డెంగ్యూ వ్యాధి దోమల వల్ల కకుగుతోంది.ముఖ్యంగా ఆఎదెస్ ఏగ్య్ప్తి అనే దోమ కారణంగా వస్తుంది.ఈ దోమ మానవుని కుట్టినప్పుడు దెంగ్యూ వ్యాప్తి
చెందుతుంది.దీనిలో కొన్ని రకాలున్నాయి.కొందరిని ఈ వ్యాధి జీవితంతాం మాపు లేకుండా బాధిస్తుంది,మరికొందరిలో కొంతకాలం తన ప్రభావాన్ని చూపుతుంది.ఏది ఏమైనా ఈ వ్యాధి తీవ్ర ఇబ్బ్బందులకు గురిచేస్తుంది.ఇంకా దీనికి వాక్సిన్ ను కనిపెట్టని కారణంగా ముందు జాగ్రత్త చర్యలే తీసుకోవాలి.అవి ఎంటో
మనం ఇప్పుదు చూద్దామా..!

డెంగ్యూ వ్యాధి లక్షణాలు.

జ్వరం:
అకస్మాత్తుగా ఇది ప్రవేశిస్తుంది.
39.5-41.4°సి ఉష్నోగ్రతల వరకూ ఉంటుంది.
1-7 రోజుల కడపటి రోజుల వరకూ వస్తుంది.1-2 రోజులకు జ్వరం తగ్గుతూ వస్తుంది.
మరలా రెండవ దశగా చిన్న చిన్న తట్టు మచ్చల్లా మొదలవుతుంది.
తలనొప్పి:
సాధారణంగా జ్వరంతో పాటూ తలనొప్పి మొదలవుతుంది.అయితే తల నుదుటి మీదకాని.కళ్ళ వెనుక కానీ తలనొప్పి వస్తుంది.
నరాల నొప్పి లేదా ఎముకుల నొప్పి:1.జ్వరంతో పటూ ఇవి బాధిస్తాయి.ఈ నొప్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
2.కటి కుడివైపు గానీ,కాళ్ళవద్దగానీ, కీళ్ళ వద్దగానీ వస్తాయి.
ఈ నొప్పులు చాలా తీవ్ర స్థాయిలో బాధిస్తాయి.
3.జ్వరం తగ్గినా నొప్పులు మాత్రం కొన్ని వారాల వరకూ బాధిస్తూనే ఉంటాయి.
నొప్పులు సాధారణంగా డీహెచెఫ్ఫ్ /డీఎసెస్ లో పోతాయి.
ఆరోచితము మరియూ వాంతులు:
1.ఆకలి మందగించటం జరుగుతుంది.
2.వాంతుల స్థాయి పెరిగిపోతుంటుంది.
3.రుచి మారిపోతుంటుంది.
4.లక్ష్ణాలు పిల్లల్లో ఉన్నంత తక్కువగా పెద్దల్లో ఉండవు.
తట్టు మచ్చలు:
ఇవి రావటం మెల్లగా మొదలవుతుంది.

డెంగుఎ హెమోర్ర్హాగిచ్ Fఈవర్ / డెంగ్యూ షాక్ సిండ్రోం:

వ్యాధి మొదలైన కొన్ని రోజులకే డెంగ్యూ అని తెలుస్తుంది.
అంతేకాక జ్వరం సహాయంతో 2-7 రోజుల తర్వాత లక్ష్ణాలు మరింతగా పెరుగుతాయి.అవి:
1.విశ్రాంతి లేకపోవటం.
2.రక్త ప్రసరణ వ్యవస్థ పాడవుతుంది.
3.రక్త స్రావం తో పాటూ మరిన్నింటిని స్పష్టం చేస్తుంది.
4.చర్మంపై ఎర్ర మచ్చలు వచ్చి బాధిస్తాయి.
5.ముక్కులోనుంచి రక్తం కార్టం జరుగుతుంది.
6.పంటి చిగురు నుంచి రక్తం కారతుంది.
7.పొట్టలోనుంచి రక్తం వస్తుంది.అంతే వాంతులు అయ్యే సమయంలో రక్తం పడుతుంది.
8.రక్త పట్టికల సాతం క్రమేపీ తగ్గిపోతుంది.డెంగ్యూ నివారించటానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టడం జరుగలేదు.అందువల్ల దీనికి ముందు జాగ్రత్త చర్యలే మార్గం.అవేంటో చూద్దాం.
ముఖ్యాంగా ఈ డెంగ్యూని వ్యాప్తి చేసేది దొమలే కాబత్తి దోమ కాటు నుంచి జాగ్రత్త వహించాలి.
ప్రపంచా ఆరోగ్య సంస్థ దిశానిర్దేశకాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం అనే ప్రోగాం ద్వారా ఇచ్చింది.
1.అవగాహనా విధానలను అందరికీ తెలియ చెప్పాలి.
2.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సమన్వయంతో దీనిపై అవగాహన కల్పించాలి.
3.వ్యాధిని నివారిచేందుకు అన్నివిధాల ప్రయత్నించాలి.
4.క్రియాశీలకమైన,నిర్ణయాత్మక తో వ్యాధి ఏ ప్రదేశాలలో ఎక్కువ ప్రబలిందో చూడాలి.
5.ఈ వ్యాధిని ఎదుర్కొనేదుకు శక్తి సామర్ధ్యాలను పెంచుకుని సమిష్టిగా క్రుషి చేయాలి.

ఇంత్లో మనం పాటించవలసిన జాగ్రత్తలు:

1.దోమలను సాధ్యమైనంతగా రానివ్వకుండా చూసుకోవాలి.
2.మురికి కాల్వలను పరిసరాలలో లేకుండా చూసుకోవాలి.
3.దోమ తెరలను వాడాలి.
4.రోజూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5.పొడవాటి బత్తలను శరీరాన్ని పూర్థిగా కప్పేటట్లు వేసుకోవాలి.
ఇలా ముందు జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

జ్ఞాపకశక్తిని పెంచేందుకు చిట్కాలు

జ్ఞాపకశక్తిని పెంచేందుకు చిట్కాలు

Image result for memory power
మీకు జ్ఞాపకశక్తి లేదా? మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటున్నారా? అయితే మీరేం బధ పడాల్సిన అవసరం లేదు. ఎలాగని సంకోచిస్తున్నారా? అయితే మనకు నిత్యం లభించే కాయగూరల్లో కొన్నింటిని ఈ క్రింద సూచించిన ప్రకారం వాడితే జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
1. ఒక క్యారెట్టు, గోబిఆకులు 10 నుండి12 అంటే కనీసం 50-60 గ్రాములు, కొత్తిమిరి ఈ మూడు కోసి ప్లేట్‌లో ఉంచుకోండి, ఆపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ రసం కొద్దిగా కలిపిన తర్వాత ఉదయంపూట టిఫిన్‌గా తీసుకోండి.2. భోజనంతో బాటే ఒక గ్లాసు మజ్జిగ తీసుకోండి. మజ్జిగ చాలా చలవని మన పెద్దవారంటారు. అవును అది నిజం. మజ్జిగలో అన్ని విశిష్ట గుణాలున్నాయి.
3. రాత్రి తొమ్మిది గంటల తర్వాత చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి అరగంటకొకసారి అరగ్లాసు నీరు త్రాగండి. మేల్కొనేటప్పుడు వచ్చే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అది కూడా పదకొండు గంటల వరకే మంచిది. ఆ పైన మేల్కొంటే ప్రమాదమే అని విశ్లేషకులంటున్నారు.
4. చాలామంది చదువుకునేటప్పుడు బోర్లా పడుకుని లేదా వంగి కూర్చుని చదువుతుంటారు. అలా చదివితే చాలా ప్రమాదమే. నిటారుగా కూర్చుని చదవాలి. దీంతో చదవడానికి ఏకాగ్రత కుదురుతుంది.
5. చదివి చదివీ అలసిపోయినప్పుడు మీకు అలసట అనిపిస్తే కాస్త అటుఇటు పచార్లు చేస్తూ తిరగండి. నిద్ర పోగొట్టడానికి టీ, సిగరెట్లు తాగకండి. విద్యార్థులు గనక పై సూచనలు, చిట్కాలను సక్రమంగా పాటిస్తే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుందట.

పిల్లల్లో ఒంటరితనం పారదోలాలంటే

పిల్లల్లో ఒంటరితనం పారదోలాలంటే

Image result for depression
ప్రస్తుతం ఉన్న సమాజంలో సామాజిక, ఆర్థిక, యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు కాస్త సమయం పిల్లలకు కేటాయించాలంటే అది చాలా కష్టమైపోతుంది. అదీకాక ఈ మధ్య ఒకే ఒక సంతానంతో తృప్తి చెందటం లేదా ఆ ఒక్కరినే బాగా చూడాలనీ, బాగా చదివించాలని తల్లిదండ్రులు కోటి ఆశల్ని కలిగిఉంటున్నారు. మరి మనపెద్దవాళ్ళు ఊరకే అనరు ఒక బిడ్డే అయితే వారికి తోడేది అని..అవును, ఇది నిజం. ఒక సంతానమే అయితే వారు ఒంటరితనం కు బానిసలైపోయి వారి మానసిక ఉల్లాసం దెబ్బతినటం మాత్రం ఖాయమే. అయితే తల్లిదండ్రులకు వారి పిల్లల్ని ఒంటరితనంలోపడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం. అవేంటో చూసేద్దామా..
Image result for child lazy boy1. ఇంట్లో ఒక్కరే ఉంటే ఎవరితో ఆడుకోవాలో తెలియదు. బయట స్నేహితులున్నా అదీ కాసేపే. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఒంటరితనాన్ని పోగొట్టడానికి రోజులో ప్రత్యేకించి కొంత సమయం వారితో తప్పనిసరిగా గడిపేలా ప్రణాలిక చేసుకోవాలి. ప్రత్యేక శ్రద్ద వారిపై చూపాలి.2. ఈ రోజుల్లో భార్యభర్త సంపాదనాపరులు అవడం, ఒక్కరే అని పిల్లలపై కానుకల వర్షం కురిపిస్తుంటారు. పిల్లల అవసరాలకు మించి ఇచ్చే ప్రతి కానుక వారికి చెడే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తుంటే కష్టం అంటే ఏమిటో తెలుసుకోలేరు. ఫలితంగా జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకోలేరు.
3. ఈ ఆధునిక ప్రపంచంలో థియేటర్ ఆర్ట్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు, కరాటే నుంచి పెయింటింగ్ వరకు, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్… ఒకటేమిటీ మల్టీ టాలెంట్‌కు కావల్సిన అవకాశాలు ఉన్నో ఉన్నాయి. వాటిని మీ బాబు లేదా పాప అందిపుచ్చుకోవడానికి అవకాశాలు కల్పించండి. ఒంటరితనం అనే భావనే వారి దరిచేరదు.
4. సాహిత్యాన్ని పరిచయం చేస్తే పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు స్నేహితుల లోటును భర్తీ చేస్తాయి. ఒంటరిగా ఉండే పిల్లలు టీవీ చూడటం, ఇంటర్‌నెట్ బ్రౌజింగ్‌తో కాలాన్ని వృధాగా గడిపేస్తుంటారు. అందుకని కచ్చితమైన సమయాన్ని మాత్రమే కేటాయించాలి.5. ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధువులతో సందడిగా ఉండే వాతావరణాన్ని సృష్టించండి. కుటుంబ పరిధి పెరుగుతున్నా కొద్ది పిల్లలు ఒంటరివారమనే భావనకు దూరం అవుతారు.
6. అమ్మాయో, అబ్బాయో ఒక్కరే ఉంటే ఇంట్లో వారి దృష్టి అంతా వారి మీదకే మళ్లుతుంది. ఒక్కరే కదా అని అతి శ్రద్ధతో పిల్లలను స్వేచ్ఛను హరించడం వారి భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. అడుగు వేస్తే కందిపోతారేమో అన్నంతగా చూస్తే పిల్లలు ఏ పని చేయడానినికైనా సొంత నిర్ణయం తీసుకోలేరు.
7. స్నేహితులుగా ఉండగలగే ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం, భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే ఒంటరి అనే భావనే పిల్లల దరిచేరదు.

సోరియాసిస్ అంటే?

సోరియాసిస్ అంటే?

Image result for soriyassis
కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.
 సోరియాసిస్ ఎలా వస్తుందంటే:
మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం,  ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.
సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే:
 1. తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్-ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచే అవకాశం ఉండదు.
2. అలాగే చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వల్ల చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. వాటిని వాడటం మంచిది.
3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు ఎన్నో మార్కెట్ లో లభిస్తున్నాయి. వీకో టర్మేరిక్ క్రీము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం జరుగుతోంది. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది.
4. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము, వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి కనుక  చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది గుర్థుంచుకోవాల్సిన విషయం. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

ఆస్థమా ఉన్నవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు

Image result for asthma care
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్‌) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.
ఆస్థమా వల్ల వచ్చే ఇబ్బందులు:
1. ఆస్థమా ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
2. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
3. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కాలుష్యం ప్రభావం:
1. ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
2. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్‌ స్టవ్‌ వాడడం వలన, వేపుడులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు
3. అలాగే గాలిలోకి పార్టి క్యులేట్‌ మెటీరియల్స్‌, రసాయనాలు, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, ఓజోన్‌ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు.
4. ఇంట్లో వాడే ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌, అయోనైజర్స్‌, జిరా క్స్‌ యంత్రాలు, ఎయిర్‌ క్లీనర్స్‌, ఫిల్టర్స్‌, ప్యూరిఫయర్స్‌ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.
5. డీజిల్‌ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్‌ మేటర్‌, నైట్రోజన్‌ డై ఆకై్సడ్‌, సల్ఫర్‌ డై ఆకై్సడ్‌, సీసం పొగ లు, కార్బన్‌ మోనాకై్సడ్‌ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్‌, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్‌, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
6. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్‌ వే రీమోడలింగ్‌ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్‌ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగ్గుతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్‌ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.
ఆస్థమాలో రకాలు…
ఎలర్జిక్‌, నాన్‌ ఎలర్జిక్‌ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్‌ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్‌ రెసిస్టెంట్‌ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.
జాగ్రత్తలు…
1. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి.
2. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
3. ఇంట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు.
4. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్‌ క్లీనర్స్‌ వాడుకోవడం మంచిది. ఇంట్లఒ బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది.
5. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.

rampa chodavaram